telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగా “డెవిల్”?

Prabhas

తెలుగులో సంచలన విజయం సాధించిన “అర్జున్‌ రెడ్డి” చిత్రంతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ, షాలిని పాండే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటించారు. ఈ చిత్రం రీమేక్‌ “కబీర్ సింగ్”తో బాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు సందీప్. షాహిద్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిన “కబీర్‌ సింగ్” బాలీవుడ్ లో రికార్డ్ లు క్రియేట్ చేసింది. షాహిద్ క‌పూర్, కియారా అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రంపై విమర్శకులు పెదవి విరిచినా ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పట్టారు. కాగా… సందీప్ రెడ్డి వంగా త‌ర్వాతి ప్రాజెక్ట్‌కి సంబంధించి కొన్నాళ్ళుగా ప‌లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌హేష్ బాబుతో సినిమా అని కొంద‌రు చెప్పుకొస్తుండ‌గా, మ‌రి కొంద‌రు స‌ల్మాన్‌తో సినిమా చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. ఆ తరువాత అక్కడే ఆయన రణ్ బీర్ కపూర్ కోసం ఒక కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాకి ‘డెవిల్’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నాడు. అయితే కొన్ని కారణాల వలన రణ్ బీర్ కపూర్ ఈ ప్రాజెక్టు పట్ల అంతగా ఆసక్తిని చూపలేదట. దాంతో సందీప్ రెడ్డి ఈ కథను ప్రభాస్ కి వినిపించగా, వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా చెబుతున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది తెలియాల్సి వుంది. ప్రస్తుతం ప్రభాస్ .. రాధాకృష్ణ దర్శకత్వంలోని సినిమా షూటింగులో బిజీగా వున్నాడు.

Related posts