“అర్జున్రెడ్డి” సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు డైరెక్టర్ సందీప్ వంగా. ప్రస్తుతం అదే సినిమాను బాలీవుడ్లో “కబీర్ సింగ్” పేరుతో రీమేక్ చేస్తున్నాడు. షాహిద్ కపూర్, కియారా ఆడ్వాణీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత సూపర్స్టార్ మహేష్తో సందీప్ ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై సందీప్ తాజాగా స్పందించాడు. “మహేష్కు కొంత కథ వినిపించాను. పూర్తి కథ సిద్ధం చేయాలి. ఏమి జరుగుతుందో చూడాలి” అని అన్నాడు. “కబీర్ సింగ్” సినిమాలో షాహిద్, కియారా అద్భుతంగా నటించారని, ఆ సినిమా కూడా “అర్జున్రెడ్డి” స్థాయిలో విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.