సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన “అర్జున్ రెడ్డి” చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్, కైరా అద్వానీ జంటగా “కబీర్ సింగ్” టైటిల్ రీమేక్ చేశారు. హిందీ వర్షన్ కి కూడా సందీప్ వంగానే దర్శకత్వం వహించారు.ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి “కబీర్ సింగ్” చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. షాహిద్ కపూర్ నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ చిత్రం ఇప్పటి వరకూ 300 కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది. ఈ చిత్రంపై బాలీవుడ్ క్రిటిక్స్ నుంచి విమర్శలు వచ్చినా సందీప్ రెడ్డి దర్శకత్వ ప్రతిభకు స్టార్ హీరోలు సైతం ఫిదా అయిపోయారు. ఇక సందీప్ రెడ్డి గత రెండు మూడు రోజులుగా “అమ్మాయి, అబ్బాయి గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు.. ఒకర్నొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం లాంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్ ఉండదని నా అభిప్రాయం” అని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ఇదిలా ఉండగా సందీప్ రెడ్డి వంగా తన తదుపరి చిత్రంపై దృష్టి సారించారు. తాజాగా హీరో మహేశ్ బాబుతో సినిమాపై దర్శకుడు వంగా సందీప్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. త్వరలో తాను మహేశ్తో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మహేశ్కి స్టోరీ లైన్ చెప్పానని, ప్రస్తుతం దానిపై వర్క్ ప్రారంభించానని సందీప్ రెడ్డి చెప్పారు.
previous post
next post