telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలుకు కన్నడ నటి రాగిణి

Ragini

కన్నడ సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ కుంభకోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో అరెస్టయిన హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీని విచారించిన సీసీబీ పోలీసులు వారిద్దరి కాల్స్‌డేటా, వాట్సాప్ సందేశాలను సేకరించారు. ఈ డేటా విశ్లేషణ ద్వారా వారిద్దరికి అనేకమంది ప్రముఖులతో లింకులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఈకేసులో నటి రాగిణి ద్వివేదికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దాంతో ఆమెను బెంగుళూరు లోని పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఇక ఇదే కేసులో మరో నటి సంజన గల్రాని, రాహుల్, ప్రశాంత్‌ రంకా, లూమ్‌ పెప్పర్, నియాజ్‌లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. వారందరికి 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే సంజనకు మాత్రం 16వ తేదీ వరకు సీసీబీ కస్టడీని పొడిగించారు. సంజనను సీబీఐ ప్రశ్నించాల్సి ఉన్న నేపథ్యంలో కస్టడీని పొడిగించినట్టు సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాగిణికి డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నట్లు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ గుర్తించింది. రాగిణికి డ్రగ్స్ టెస్ట్ కోసం ఆస్పత్రికి తరలించినప్పుడు ఆమె మోసానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఆమె డ్రగ్ టెస్ట్ కోసం యూరిన్ శాంపిల్ ఇస్తూ అందులో నీరు కలిపినట్టు గుర్తించారు.

Related posts