విశాఖపట్నంలోని ముడుసర్ లోవలో ఈరోజు ప్రభుత్వ ఇసుక రీచ్ ను ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ తెచ్చేవరకూ పాత విధానమే నడుస్తుందని తెలిపారు.కొత్త ఇసుక పాలసీపై కసరత్తు జరుగుతోందని తెలిపారు. ఇసుక పాయింట్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఇసుకను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. రెవెన్యూ, మైనింగ్ శాఖలు ఈ బాధ్యతలను సంయుక్తంగా చూస్తాయని పేర్కొన్నారు. కొత్త ఇసుక పాలసీ విధివిధానాలను రాబోయే రెండ్రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు.