telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ కొత్త ఎస్‌ఈసీ పేరు ఖరారు.. ఎవరంటే !

ఏపీ ప్రస్తుత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ పదవీ కాలం ఈ నెల చివర్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏపీ కొత్త ఎస్‌ఈసీగా… గవర్నర్‌ ఎవరినీ నియమిస్తారోనని అందిరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కొత్త ఎస్ఈసీ నియామకంపై సర్కార్ కసరత్తు చేసింది. మాజీ సీఎస్ నీలం సాహ్ని, ప్రేమ చంద్రా రెడ్డి, శామ్యూల్ పేర్లను పరిశీలిస్తోన్న ప్రభుత్వం…ఈ మేరకు గవర్నరుకు ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం అందుతోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఎస్‌ఈసీగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి మైలాపల్లి శామ్యూల్‌ నియమితులుకానున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పంపిన ముగ్గరిలో పేర్లలో.. సీఎం జగన్‌ మాత్రం శ్యామ్యూల్‌ వైపే మొగ్గుచూపాడని సమాచారం అందుతోంది. ప్రస్తుతం శ్యామ్యూల్‌ నవరత్నాల పర్యవేక్షణ సలహాదారులుగా ఉన్నారు. ఇక గవర్నర్‌.. ఎస్‌ఈసీగా శ్యామూల్‌నే ప్రకటిస్తారా ? లేదా వేరే వాళ్లను నియమిస్తారా త్వరలోనే తేలనుంది.

Related posts