telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

సరికొత్త శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్..భారత్‌లో విడుదల

samsung galaxy tab 2019 released

శాంసంగ్ తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6ను తాజాగా భారత్‌లో విడుదల చేసింది. రూ.59,900 ధరకు ఈ ట్యాబ్ వినియోగదారులకు లభిస్తున్నది. ఈ ట్యాబ్ కొనుగోలుపై కస్టమర్లకు 6 నెలల పాటు ఉచితంగా యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో ఈ ట్యాబ్‌ను కొనుగోలు చేస్తే రూ.5వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6 ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లో… 10.5 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0పై, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆప్టికల్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 7040 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

Related posts