శాంసంగ్ నేడు భారత మార్కెట్లో గెలాక్సీ ఎ80 పేరిట ఓ నూతన స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఎ సిరీస్లో వచ్చిన టాప్ ఎండ్ గెలాక్సీ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో 8 జీబీ పవర్ఫుల్ ర్యామ్ను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న రొటేటింగ్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీంతో ఇదే కెమెరాను సెల్ఫీల కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్ రూ.47,990 ధరకు వినియోగదారులకు ఆగస్టు 1వ తేదీ నుంచి లభ్యం కానుంది.
గెలాక్సీ ఎ80 ఫీచర్లు :
6.7 ఇంచుల డిస్ప్లే,
ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 730జి ప్రాసెసర్,
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 9.0 పై,
48, 8 మెగాపిక్సల్ రొటేటింగ్ కెమెరాలు,
ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్,
డాల్బీ అట్మోస్,
డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ,
యూఎస్బీ టైప్ సి,
3700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.
శ్రీవారి లడ్డూతో వ్యాపారం చేయడం తప్పు: రమణ దీక్షితులు