ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎ20ఎస్ను భారత్లో తాజాగా విడుదల చేసింది. ఈ ఫోన్కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.11,999 ఉండగా, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.13,999గా ఉంది.
గెలాక్సీ ఎ20ఎస్ స్మార్ట్ఫోన్లో… 6.4 ఇంచుల డిస్ప్లే, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4జీబీ ర్యామ్, 32/64జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0పై, 13, 8, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.