telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

మెరుపులు మెరిపించిన.. రాహుల్‌ ద్రవిడ్‌ తనయుడు సమిత్ ద్రవిడ్ ..

samith dravid double century in under-14 tournament

రాహుల్‌ ద్రవిడ్‌ కొడుకు సమిత్‌ ద్రవిడ్‌ తండ్రికి తగ్గ తనయుడిగా జూనియర్ లెవల్ క్రికెట్‌లో మెరుపులు మెరిపిస్తున్నాడు. కర్ణాటకలో జరిగిన అండర్ -14 రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్‌లో డబుల్ సెంచరీ చేసి సెన్సేషన్ సృష్టించాడు… భారత మాజీ కెప్టెన్, రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్. మనకు తెలుసు రాహుల్ ద్రవిడ్‌ను భారత టెస్ట్ క్రికెట్‌లో మిస్టర్ వాల్, వాల్ ఆఫ్ ది టీమ్ అని పిలుస్తారని. ఎందుకంటే… ద్రవిడ్ క్రీజ్‌లోకి వచ్చాడంటే చాలు… ఎంత మంది బౌలింగ్ వేసినా… ఔట్ అవ్వనే అవ్వడు. చివరకు బాల్స్ వేసీ, వేసీ అలసిపోయిన చరిత్ర బౌలర్లది. ఇలా జట్టు కెప్టెన్‌గా, అద్భుత బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా ద్రవిడ్ మర్చిపోలేని సేవలు అందించాడు. ఇప్పుడు కూడా టీమిండియా జూనియర్ జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. తాజాగా ద్రవిడ్ కొడుకు సమిత్ కొంతకాలంగా క్రికెట్ ఆడుతున్నాడు. తండ్రి నుంచీ ఆటలో మెలకువలన్నీ తెలుసుకున్నాడు. ఢిల్లీలో అండర్ 14 రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్‌లో డబుల్ సెంచరీ బాదేశాడు.

టోర్నమెంట్‌లో వైస్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ టీమ్‌కి ఆడుతున్న సమిత్ ద్రవిడ్ తాజాగా ధార్వాడ్ జోన్‌తో కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో 201 పరుగులు చేశాడు. మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 256 బంతులు ఎదుర్కొన్న ఈ బుడతడు ఏకంగా 22 ఫోర్లు కొట్టడం విశేషం. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ సమిత్ ద్రవిడ్ 94 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారత్ అండర్-19, భారత్-ఎ జట్టుకి కోచ్‌గా సేవలు అందించిన రాహుల్ ద్రవిడ్.. ఇటీవల బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. భారత క్రికెటర్లు ఎవరైనా గాయపడితే..? ఈ అకాడమీ వారు మళ్లీ ఫిట్‌నెస్ సాధించేందుకు సాయపడుతుంది.

Related posts