telugu navyamedia
సినిమా వార్తలు

సమంత పని చేయాలనీ కోరుకునే డైరెక్టర్స్ వీరే…

Samantha

దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “ఓ బేబీ” అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. “ఎంత సక్కగున్నావే” అనేది ట్యాగ్ లైన్. “మిస్ గ్రానీ” అనే కొరియన్ సినిమాను నందిని రెడ్డి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత సరికొత్త లుక్ లో కనిపించనుంది. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. ఊర్వశి, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. నేడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఎమోష‌న‌ల్‌తో పాటు ప‌లు కామెడీ సన్నివేశాల‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరిస్తుంది. ఈ చిత్రాన్ని స‌మంత భారీగా ప్ర‌మోట్ చేసుకుంది. ఓ ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో స‌మంత త‌నకి ఇద్దరు డైరెక్ట‌ర్స్‌తో ప‌ని చేయాల‌ని చాలా ఆస‌క్తిగా ఉంద‌ని పేర్కొంది. అందులో ఒక‌రు యూత్‌ఫుల్ చిత్రాల‌ని అద్భుతంగా తెర‌కెక్కించ‌గ‌ల ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌. మ‌రొక‌రు ఆణిముత్యాల్లాంటి సినిమాల‌ని తెర‌కెక్కించే మ‌ణిర‌త్నం. వీరిద్దరి ద‌ర్శ‌క‌త్వంలో ఎప్ప‌టికైన ఓ సినిమా చేయాల‌నుంద‌ని స‌మంత చెప్పడం విశేషం. అయితే ప్ర‌స్తుతం స‌మంత భ‌ర్త చైతూ, శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అయితే ఇందులో స‌మంతను హీరోయిన్ గా ఎంపిక చేసుకుంటారా ? లేదా ? అనేది తెలియాల్సిఉంది.

Related posts