తన భర్త కోసం స్పెయిన్లో ఎదురుచూస్తోంది సమంత. ఈ మేరకు సమంత సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. చైతన్య, సమంత కలిసి నటించిన “మజిలీ” సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత నాగార్జున నటిస్తున్న “మన్మథుడు-2” కోసం సమంత చిత్రబృందంతో కలిసి పోర్చుగల్ వెళ్లింది. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సమంత అతిథి పాత్రలో కనిపించనుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న అనంతరం పోర్చుగల్ నుంచి సమంత స్పెయిన్కు వెళ్లింది. నాగచైతన్య మాత్రం హైదరాబాద్లోనే ఉండిపోయాడు. దీంతో చైతూను బాగా మిస్సవుతున్నట్టుగా తెలుపుతూ సమంత సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. బాధగా చూస్తున్న తన స్కెచ్ ఫోటోను పోస్ట్ చేసి దానిపై “నా చైతన్య కోసం ఎదురుచూస్తున్నా” అని పేర్కొంది.
previous post