telugu navyamedia
సినిమా వార్తలు

సమంత ఎమోషనల్ పోస్ట్… “ఏమాయ చేసావే”పై చిత్రబృందం ట్వీట్స్

samantha-and-Nagachaitanya

“ఏమాయ చేసావే” చిత్రంతో టాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సమంత. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత వీరిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మంగళవారం నాడు “ఏమాయ చేసావే” చిత్రం నిర్మాత మంజుల ఘట్టమనేని “తొమ్మిదేళ్లు అవుతోంది. అయినా.. అంతా నిన్నే జరిగినట్లుంది. ఈ సినిమా కోసం పని చేసిన వారందరికీ ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశారు.

ఇది చూసిన సమంత “నా జీవితాన్ని మార్చేసిన అవకాశం ఇచ్చినందుకు థాంక్స్… అభిమానులు లేకపోతే నటిగా నాకు ఈ స్థానమే లేదు” అంటూ లవ్ సింబల్స్ తో ఎమోషనల్ గా పోస్ట్ చేసింది సమంత. ప్రస్తుతం సమంత తన భర్త నాగచైతన్యతో కలిసి “మజిలీ” సినిమాలో నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ చిత్రంలో సమంతకు అన్నగా నటించిన హీరో సుధీర్ బాబు కూడా స్పందించారు. “సినిమా సెట్ నాలాగా యాక్టర్ కావాలనుకునే వారికి, నేర్చుకోవాలనుకునే వారికి ఒక స్కూల్ లాంటిది. ఏమాయ చేసావే సెట్లో నేను చాలా నేర్చుకున్నాను. దర్శకుడు గౌతమ్ మీనన్ గారికి నా పేరు సజెస్ట్ చేసినందుకు ఘట్టమనేని మంజుల గారికి థాంక్స్” అంటూ ట్వీట్ చేశారు.

Related posts