తెలుగు హీరోయిన్లతో సమంతకు ఉన్న క్రేజ్ మామూలుదేం కాదు. తెలుగులోనే కాదు దక్షిణ భారత దేశంలోని సినీ రంగాల్లో సమంతకు మంచి ఫాలోయింగ్ ఉంది. పెళ్ళి అయ్యాక కూడా ఈ అమ్మడుకు హవా ఏమాత్రం తగ్గలేదు. “ఏం మాయ చేశావే”తో తెలుగు కుర్రాళ్ళను మాయ చేసేసింది సమంత. అంతేనా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ తన అభిమానులను అలరిస్తుంది సమంత. దీంతో సోషల్ మీడియాలోనూ తన అభిమానులను అంతకంతకు పెంచుకుంటూ పోతుంది సమంత. తాజాగా ఈ అమ్మడు ఇన్స్టాగ్రామ్లో సమంత 10 మిలియన్లు (కోటి) మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈ సందర్భంగా తాను 10 ఎన్జీవో సంస్థలకు సహాయం చేస్తానని ప్రకటించింది. హాలీవుడ్ నటి నటాలీ పోర్ట్మన్ కూడా ఇలానే చేశారని.. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా చేశానని సమంత వెల్లడించారు. అన్నట్టుగానే సమంత ఆశ కుటీర్, లహరి ఓల్డేజ్ హోమ్, డిజైర్ సొసైటీ, వాల్మీకి ఫౌండేషన్, స్పందన సొసైటీ, అక్షయ ట్రస్ట్, భారతమాత సోషల్ సర్వీస్ సొసైటీ, మా ఇల్లు, గుడ్ సమరితన్స్ ఇండియా, నిర్మాణ్ అసోసియేషన్లకు విరాళాలు అందజేసినట్టు సమంత స్పష్టం చేశారు.సమంత దాతృత్వంపై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో కాజల్ అగర్వాల్, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డేలకు ఇన్స్టాలో 10 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.