telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

అప్పుడు బాధేసింది.. ఇప్పుడు నవ్వొస్తుంది

Samantha

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లలో సమంత కూడా ఒకరు.అక్కినేని ఇంట కోడలుగా అడుగుపెట్టిన తర్వాత కూడా సినిమాలో నటిస్తుంది ఈ అమ్మడు. అయితే ప్రస్తుతం వెబ్ సిరీస్ లు, బిజినెస్ ల మీద సమంత దృష్టి ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఇటీవలే సమంత అక్కినేని హోస్ట్‌గా ఉన్న స్యామ్ జామ్ షో బాగానే ఆకట్టుకుంటుంది. దీంతో సమంత బుల్లితెరపై కూడా సక్సెస్ అయిందనే చెప్పాలి. కాగా, అభిమానులతో ఎప్పుడు సోషల్ మీడియాలో టచ్ లో ఉండే సమంత రీసెంట్ గా చాట్ లో కి వచ్చింది. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు, సమాధానాలు షేర్ చేసుకుంది. ఇక ట్రోలింగ్‌ విషయమై అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. “ఒకప్పుడు ట్రోలింగ్‌ వల్ల నిద్ర లేని రాత్రులు గడిపాను.. కానీ ఇప్పుడు మాత్రం భలే నవ్వొస్తుంది. అయినా వారు ట్రోల్‌ చేస్తున్నారంటే మనం ఎంతో ఎత్తుకు ఎదిగామనిపిస్తుంది” అని సమంత చెప్పుకొచ్చింది. కాగా, సమంత త్వరలో గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘శాంకుతలం’ సినిమా చేస్తోంది. వెబ్ సిరీస్ లో నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. చూడాలి మరి ఇది ఏ మేర తారకు విజయాన్ని అందిస్తుంది అనేది.

Related posts