telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

పట్టాలు తప్పిన .. సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌.. ఇద్దరు మృతి.. పలువురికి తీవ్రగాయాలు..

samaleswari express engine derailed 2 died

సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఒడిశాలోని రాయగఢ్‌- కోరాపుట్‌ మార్గంలో పట్టాలు తప్పింది. ఇంజిన్‌ పట్టాలు తప్పడంతో వెనుక ఉన్న రెండు బోగీలకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

హావ్‌డా నుంచి జగదల్‌పూర్‌ వైపు వెళ్తుండగా కెవుటాగూడ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సహాయక చర్యల కోసం విశాఖ నుంచి రిలీఫ్‌ వ్యాన్‌ బయల్దేరింది. 12 మంది వైద్యులతో పాటు రైల్వేఅధికారులు రిలీఫ్‌ వ్యాన్‌లో ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts