స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రాన్ని హారిక మరియు హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లలో ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. తమన్ స్వరకర్త. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘సామజవరగమన’ సాంగ్ త్వరలో విడుదల కానుందని తెలుపుతూ సాంగ్కు సంబంధించిన చిన్న బిట్ను గురువారం అల్లు అర్జున్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. చిన్న లైన్తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ యొక్క పూర్తి లిరికల్ వీడియోను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. ‘నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు… ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు’… ‘సామజవరగమన’ పాటలో సాహిత్యం ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి విడుదల చేసిన వాక్యాలివి. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా, సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట (లిరికల్ వీడియో) అద్భుతంగా ఉంది. తమన్ మాట్లాడుతూ ‘‘ఈ పాటలో ఎక్కువ ఎలకా్ట్రనిక్స్ లేకుండా… నేచురల్గా పియానో, బేస్ గిటార్, డ్రమ్స్, వయొలిన్ లైవ్ సౌండ్స్తో చేయాలనుకున్నాం. అలాగే చేశాం. 70 కంటే ఎక్కువ మంది ఉన్న ఆర్కెస్ట్రా ఈ పాటకు వర్క్ చేసింది. సీతారామశాస్త్రిగారి సాహిత్యం ఈ పాటకు మర్యాద తెచ్చింది’’ అన్నారు. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుందని సమాచారం. మీరు కూడా ఈ లిరికల్ వీడియోను వీక్షించండి.