టాలీవుడ్ లో ఏకంగా సూపర్స్టార్ మహేష్ బాబుతో మొదటి సినిమాలో నటించిన కియారా అద్వానీ “భరత్ అనే నేను” సినిమాతో తెలుగు తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత రామ్చరణ్ కు జంటగా “నయవిధేయ రామ” సినిమాలో మెరిసింది. 2104లో “పుగ్లి” సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కియారా అసలు పేరు ఆలియా ఆడ్వాణీ. ఈ విషయాన్ని స్వయంగా కీయారా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ సూచన మేరకు తన పేరును కియారాగా మార్చుకుందట. “నాకు మా అమ్మానాన్నా పెట్టిన పేరు ఆలియా. కానీ నేను బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే సమయానికే అదే పేరుతో వేరే హీరోయిన్ ఉన్నారు. అప్పుడు సల్మాన్ నన్ను పేరు మార్చుకోమని సూచించారు. ఒకే పేరుతో ఇద్దరు హీరోయిన్లు ఉండకూడదని ఆయన చెప్పారు. అప్పుడు నేను కియారా అనే పేరును సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నన్ను ఇంట్లో కూడా ఆలియా అని కాకుండా కియారా అనే పిలుస్తున్నారు” అంటూ ఎవరికీ తెలియని సీక్రెట్ ను బయటపెట్టేసింది ఈ ముద్దుగుమ్మ.
previous post
ప్రేమ పాజిటివ్ గా ఉండాలి… వికృత రూపంలో కాదు : హరీష్ రావు