telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

మండుటెండలకు స్పృహ కోల్పోయిన నెమలి.. సెలైన్ ఎక్కించిన వైద్యులు

peacock

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతతో జనాలతో పాటు మూగ జీవాలు విలవిలలాడిపోతున్నాయి. ఉష్ణతాపం నుంచి ఉపశమనం పొందేందుకు మూగజీవాలు పడరాని ఇబ్బందులు పడుతున్నాయి. ఎక్కడైనా నీరు కనబడితే చాలు.. అక్కడ వాలిపోతున్నాయి. జనగామ శివారులో జాతీయ పక్షి నెమలి వేడిగాలులను తట్టుకోలేకపోయింది.

ఓ బోరు వద్ద వస్తున్న నీటి వద్దకు వెళ్లి, కాసేపు సేదతీరింది. అయినప్పటికీ అది స్పృహ కోల్పోయింది. విషయాన్ని గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలోని అంబులెన్స్‌ సిబ్బంది వెంటనే ఆ నెమలికి చికిత్స అందించింది. ఆ నెమలికి సెలైన్ ఎక్కించి ఎండవేడి నుంచి ఉపశమనం కలిగించారు.

Related posts