telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

2020లో వేతనాలు .. భారీగా పెరుగుతాయట..

salary hike will be there in 2020

2020 లో వేతనాలు భారీగా పెరగనున్నాయా…అంటే అవుననే అంటున్నాయి పలు సర్వేలు. ఈ పెరుగుదల మొత్తం ఆసియా లోనే అత్యధికం కావటం విశేషం. ఉద్యోగాలు పోవటమే కానీ రావటం వినిపించని ఈ సమయంలో వేతనాలు పెరుగుతాయన్న విషయం నిజంగా శుభవార్తే కదా? కార్న్ ఫెర్రీ అడ్వైసోరీ ఇండియా అనే సంస్థ ఆసియాలోని వివిధ దేశాల్లో 2020 సంవత్సరంలో వేతనాల పెరుగుదల పై ఒక సర్వే నిర్వహించింది. అందులో భారత్ ముందు ఉందట. ఈ సర్వే ప్రకారం 2020 లో అన్ని దేశాలకంటే అధికంగా భారత్ లో 9.2% వేతనాలు పెరుగనున్నాయి. మన దేశం తర్వాత 8.1% పెరుగుదలతో ఇండోనేషియా రెండో స్థానంలో నిలిచింది. పొరుగు దేశం చైనా లో వేతనాల పెరుగుదల రేటు కేవలం 6% మాత్రమేనని ఈ సర్వే వెల్లడించింది. ఆసియాలో అతి తక్కువ వేతనాల పెరుగుదల జపాన్ (2%), తైవాన్ (3.9%) లో నమోదు కానుందని ఈ అధ్యనం పేర్కొంది. ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో ఈ విషయాలను వెల్లడించింది.

భారత ప్రభుత్వం తీసుకొంటున్న సంస్కరణ ఫలితాలు అనుకున్నరీతిలో ఫలాలిస్తే, 2020 నిజంగా ఉద్యోగులకు సంతోషాలను అందించే అవకాశం ఉంది. ఇంకా వ్యక్తిగత ఆదాయ పరిమితులను సవరించే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. ఒక వేళ అది కూడా జరిగితే వేతన జీవులు ఊరట చెందే అవకాశాలు ఉన్నాయి. ఒక వైపు ధరల పెరుగుదల … మరో వైపు ఉద్యోగాల కోత. ఎటు చూసినా ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ప్రస్తుత అధ్యయనం కొంత ఆశాభావాన్ని తీసుకొచ్చింది. ఈ సంస్థ అంచనా వేసినట్లు ఖచ్చితంగా ఇంత మొత్తం పెంచాలన్న నియమం ఎక్కడా లేకపోయినా… చాలా కంపెనీలు ఆ మేరకు వేతనాలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించటం విశేషం. సాధారణంగా ఒక రంగంలోని అతి పెద్ద కంపెనీ ఏది చేస్తే మిగతా కంపెనీలు దానిని అనుసరించడం సహజమే. ఐటీ సహా అన్ని రంగాల్లోని పెద్ద కంపెనీలు సగటున 10% వేతనాల పెంపు నిర్ణయం తీసుకొంటే… అది మొత్తం దేశ వ్యాప్తంగా అదే స్థాయిలో జీతాల పెరుగుదలకు దోహదం చేస్తుందనటంలో సందేహం లేదు.

Related posts