‘షీ’ టీమ్స్ పేరిట తెలంగాణలో కొన్నాళ్ల కిందట ఏర్పాటైన మహిళా పోలీస్ దళాలు బాగా విజయవంతమయ్యాయి. అదే తరహాలో ఏపీలోనూ మహిళలతో పోలీస్ దళాలు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నంలో ‘శక్తి’ టీమ్స్ పేరిట ఏర్పాటైన మహిళా పోలీస్ దళాలను రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఇవాళ ప్రారంభించారు. ఈ ‘శక్తి’ టీమ్ కార్యకలాపాల కోసం 5 కార్లు, 26 హోండా యాక్టివాలు కేటాయించారు.
ఇటీవల విశాఖలో రేవ్ పార్టీ జరిగిన నేపథ్యంలో డ్రగ్స్ మాఫియా తెరపైకి రావడం, తనను కలచివేసిందని డీజీపీ ఠాకూర్ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫిర్యాదులు, సమాచారం కోసం ప్రత్యేకంగా ఫోన్ నంబర్ ను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.