ఆవిర్భావోత్సవాల్లో పాల్గొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం వైఎస్ జగన్ పదేళ్ల క్రితం అడుగులు వేశారు.. ప్రజల మద్దతుతో వైసీపీను స్థాపించి అధికారం చేపట్టారన్నారు.. పదో ఆవిర్భావం దినోత్సవం పూర్తిచేసుకున్న సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలిపిన సజ్జల.. ప్రజలు పండుగగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుటున్నారన్నారు.. రాజకీయపార్టీ ఎలా ఉండాలో నిరూపించిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్న ఆయన.. ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన విజయం ప్రజా విజయంగా అభివర్ణించారు.. ఇచ్చిన హామీలు అమలుతో పాటు కొత్త హామీలు అమలు చేస్తున్నారని ప్రశంసించిన ఆయన.. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం పైగా స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు గెలిచారు.. ఇక, మున్సిపల్ ఎన్నికల్లో నూటికి నూరు శాతం స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు వెళ్తుండడంతో ప్రజలు వైసీపీను సొంతం చేసుకున్నారన్న సజ్జల.. ప్రతిపక్షం అవసరం లేదని ప్రజలు తిరస్కరించిన వైనం ఎన్నికల ఫలితాలతో తెలుస్తుందన్నారు.
previous post