telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అర్నాబ్… జాతికి పట్టిన చీడ : సజ్జల ఫైర్

Sajjala ycp

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతోంది. వైసీపీ, టీడీపీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీపై రిపబ్లిక్‌ టీవీలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆగ్రహించారు. వైసీపీలో ఎలాంటి సంక్షోభం లేదు…గందరగోళం లేదని..రిపబ్లిక్ టీవీలో ఫేక్ స్టోరీ ప్రసారం చేసారని సజ్జల ఫైర్‌ అయ్యారు. రిపబ్లిక్ టీవీలో వచ్చే కథనాల్లో ఏ ఒక్కటీ నిజం లేదని… నిప్పు లేదు.. పొగ లేదు.. ఏం లేకుండానే కథనాలు వండి వార్చారని మండిపడ్డారు. జగన్‌ పాపులారిటీని తట్టుకోలేకే ఇలా ఇస్తున్నారని.. రిపబ్లిక్‌ టీవీలో తప్పుడు కథనాలు ప్రసారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు సజ్జల. అర్నాబ్… జాతికి పట్టిన చీడ అని… చంద్రబాబు కోసం రిపబ్లిక్ టీవీలో ఈ కథనం వండి వార్చారా అనే అనుమానం కలుగుతోందన్నారు. గతంలో నంద్యాల ఉప ఎన్నికల సందర్భంలోనూ రిపబ్లిక్ టీవీ ఫేక్ కథనాలిచ్చిందని ఆరోపించారు. ప్రజలపై చంద్రబాబు ఆక్రోశం, అశోక్ గజపతి రాజు మహిళా కార్యకర్తపై చేయి చేసుకోవడం వంటి అంశాలు చాలా ఉంటే.. వైసీపీపై ఫేక్ కథనాలు ప్రజల్లోకి తీసుకుపోతున్నారని ఫైర్‌ అయ్యారు. ఈ కథనాల వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసని తెలిపారని.. పెట్టుబడుల ఉప సంహరణకు ఆద్యుడు చంద్రబాబు అని పేర్కొన్నారు.

Related posts