telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచడంలో వైసీపీ సక్సెస్ అయ్యింది…

Sajjala ycp

ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచడంలో వైసీపీ సక్సెస్ అయిందని, ప్రత్యేక ప్యాకేజీ పేరుతో హోదా అంశాన్ని టీడీపీ చంపే ప్రయత్నం చేసిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల అన్నారు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ఎంపీలు సింహాల్లా రాజీనామా చేసి ప్రత్యేక హోదా కోసం పోరాడామని అన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు విషయంలో ప్రభుత్వ పరంగా చేయాల్సిందంతా చేస్తున్నాం అని పేర్కొన్న ఆయన ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు విషయంలో రాష్ట్రానికి మేలు చేసే స్థితిలో ఉన్న బీజేపీ మమ్మల్ని విమర్శిస్తోందని అన్నారు. బీజేపీ, టీడీపీ నేతలేం చెబితే అదే జనసేన చెబుతోందని ఇసుక ద్వారా ఆర్థిక లావాదేవీలే రూ. 950 కోట్ల మేర జరుగుతోంటే.. వేల కోట్లల్లో అక్రమాలు ఎక్కడ జరుగుతాయి..? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలు ఇప్పుడూ జరుగుతున్నాయనే భ్రమలో టీడీపీ ఉందని అన్నారు. తాను ఓ పార్టీకి ఏజెంట్ గా పని చేస్తున్నాను అనే విషయాన్ని ఎస్ఈసీ నిమ్మగడ్డ మరోసారి నిరూపించుకున్నారని అన్నారు.

Related posts