telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చంద్రబాబు కడుపు మంటతో రగిలిపోతున్నాడు…

sajjala

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి…. సీఎం జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సమాజంలో అన్ని వృత్తులకు జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారని.. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో రాష్ట్రంలో కోటి కుటుంబాలకు పైగా లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. గతంలో సరైన మౌళిక సదుపాయాలు లేకుండా ఇళ్ల నిర్మించేవారని… 17 వేలకు పైగా కొత్త ఊళ్ళు జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారన్నారు.  వచ్చే మూడు, నాలుగు ఏళ్లలో కొత్త ఊళ్లలో అనేక మంది మహిళలను యాజమానులను చేస్తున్నారని..ప్రతి తల్లిలో విజయమ్మను చూస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. సర్వాధి కారాలు తల్లులకు కట్టబెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని…మేనమామలా పిల్లలకు బట్టలు కుట్టించి ఇచ్చాడన్నారు. చంద్రబాబు పాలనలో… రాజకీయ నాయకుడుగా సదావకాశం వినియోగించుకోలేదని… జగన్మోహన్ రెడ్డి ప్రజా పాలకుడిగా రెండేళ్ల లో ఇచ్చిన హామీలు నేరవేర్చారని పేర్కొన్నారు. జన్మభూమి కమిటీల లంచాల పనితీరు మీరు చూశారని… కుల ,మత, పార్టీల బేధం లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో జగన్మోహన్ రెడ్డి డబ్బు జమ చేశారని గుర్తు చేశారు. మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని… 300 కోట్లు అప్పును రాష్ట్ర ప్రజల నెత్తిపై మోపిన వ్యక్తి చంద్రబాబు అని ఫైర్‌ అయ్యారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి గా ఉన్న వ్యక్తి కడుపు మంటతో రగిలిపోతున్నాడని.. ఇళ్ల పట్టాల పండగను తప్పుదోవ పట్టించేందుకు మతం రంగు పులుముతున్నారని మండిపడ్డారు.

 

Related posts