telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

చంద్రబాబు ధర్నా ఓ డ్రామా : సజ్జల

Sajjala ycp

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ రేణిగుంట ఎయిర్ పోర్టులో చంద్రబాబు ధర్నా ఓ డ్రామా అని ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ను నమ్ముకొని చంద్రబాబు షో చేస్తున్నారని అన్నారు. టీడీపీ ఉనికి కోసం చంద్రబాబు పాకులాటని ఆయన అన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ధర్నా చేయరాదని చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించిన ఆయన పోలీసులు అనుమతి నిరాకరించినా ధర్నా పేరుతో చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ విశాఖ ఎయిర్ పోర్టు లో ఆందోళన చేశారని, అదే నిజమైన ధర్నా అని అన్నారు. చంద్రబాబు ధర్నాలు కేవలం పబ్లిసిటీ కోసమేనని పేర్కొన్న ఆయన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనం ఖాయం అని అన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు రిపీట్ కానున్నాయని, పార్టీ గుర్తుపై ఎన్నికల్లో పాజిటివ్ ఓటు మరింత పెరుగుతుందని అన్నారు. టీడీపీ వెంటిలేటర్ పై ఉన్న పార్టీ అని మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబుకు అభ్యర్థులు  దొరకక మాపై ఆబండాలు వేస్తున్నారని అన్నారు. చూడాలి మరి దీని పై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారు అనేది.

Related posts