యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రంగా ‘ఆదిపురుష్’ అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రం తెరకెక్కనుంది. ‘చెడు మీద మంచి సాధించిన విజయం’ అనేది ట్యాగ్ లైన్. రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘ఆదిపురుష్’ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాని దాదాపు 350 కోట్ల బడ్జెట్తో టీ-సిరీస్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. అయితే.. ఇందులో రావణ్ పాత్రను బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పోషిస్తున్నాడు. ఆ పాత్ర పేరుని లంకేష్ అని కూడా ప్రకటించారు. అయితే.. ఓ ఇంటర్వ్యూలో సైఫ్ అలీ ఖాన్ తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లంకేష్ పాత్ర నెగెటివ్ రోల్ అయినప్పటికీ దర్శకుడు ఆ పాత్రకి మానవతా కోణాన్ని జోడించాడు. లక్ష్మణుడు..సూర్పణక ముక్కు కోయడం, వంటి విషయాల్లో లంకేష్ మానవతా కోణాన్ని చూపించనున్నారని అన్నాడు. ఆదిపురుష్లో సీతగా బాలీవుడ్ భామ క్రితి సనన్ నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.
నాగబాబు కౌంటర్ పై బాలయ్య స్పందన