telugu navyamedia
సినిమా వార్తలు

కృష్ణజింక కేసులో నటీనటులకు హైకోర్టు నోటీసులు

Black buck poaching case

బాలీవుడ్ ప్రముఖ నటీ,నటులు సైఫ్ అలీఖాన్, సోనాలీ బెంద్రె, నీలం, టబు, దుష్యంత్ సింగ్ లకు కృష్ణ జింకను వేటాడిన కేసులో రాజస్థాన్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కృష్ణ జింకను వేటాడిన కేసులో హీరో సల్మాన్ ఖాన్ తోపాటు పలువురు సినిమా నటీనటులు నిందితులుగా ఉన్న కేసును గతంలో చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు కొట్టివేసింది. దీనిపై రాజస్థాన్ సర్కారు పిటిషన్ వేయడంతో హైకోర్టు తాజాగా మళ్లీ సినీనటులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను 8 వారాల తర్వాత చేపట్టాలని హైకోర్టు నిర్ణయించింది. సినిమా చిత్రీకరణకు వెళ్లి కృష్ణ జింకను వేటాడిన కేసులో ప్రధాన నిందితుడు సల్మాన్ ఖాన్ అన్న విషయం అందరికీ తెలిసింది.

Related posts