“ఫిదా” సినిమాతో యువతను ఫిదా చేసి తనవైపుకు తిప్పుకుంది కేరళ బ్యూటీ సాయిపల్లవి. తన సహజ నటనతో సినీ ప్రియుల్ని అలరిస్తూ అనతికాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగిపోయింది ఈ బ్యూటీ. ఈ భామ రెమ్యునరేషన్ విషయంలో సమంత, అనుష్కను వెనక్కి నెట్టేసిందట. “పడిపడి లేచె మనసు” సినిమాకు సాయిపల్లవి రూ.1.40 కోట్లు డిమాండ్ చేసిందట. ప్రస్తుతం టాప్ హీరోయిన్లుగా ఉన్న సమంత, కాజల్, అనుష్క శెట్టి, త్రిష కూడా తమ కెరీర్ తొలినాళ్లలో ఇంత పెద్ద మొత్తంలో డిమాండ్ చేయలేదు. దీంతో తక్కువ సమయంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటిగా నిలిచింది సాయిపల్లవి. ఈ భామ ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి లవ్స్టోరీ చిత్రంలో నటిస్తోంది.
previous post