telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్ బాబు మూవీలో ఛాన్స్‌ వదులుకున్న సాయి పల్లవి

saipallavi said no to another add chance

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు పక్కన ఛాన్స్‌ వదులుకుందట సాయి పల్లవి. అనిల్ రావిపూడి దర్వకత్వంలో మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. కాగా ఈ మూవీలో మొదట హీరోయిన్‌గా సాయి పల్లవిని అనుకున్నారట. ఈ మేరకు ఆమెను సంప్రదించినట్లు కూడా సమాచారం. అయితే కారణాలు తెలీవు గానీ ఇందులో తాను నటించలేనని చెప్పిందట. ఇక ఆ తరువాత ఆ ఆఫర్ రష్మికకు వెళ్లినట్లు సమాచారం. కాగా కెరీర్ ప్రారంభం నుంచి చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వస్తోంది సాయి పల్లవి. ఈ క్రమంలోనే తెలుగు, తమిళ్‌లో చాలా సినిమాలను ఆమె వదులుకున్నట్లు టాక్‌ ఉంది. ఇక సరిలేరు నీకెవ్వరులో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని భావించిన సాయి పల్లవి.. ఆ ఆఫర్ కు నో చెప్పినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం సాయి పల్లవి, రానా విరాట పర్వం.. నాగ చైతన్య సరసన లవ్ స్టోరీలో నటిస్తోంది.

Related posts