సూపర్స్టార్ మహేష్ బాబు పక్కన ఛాన్స్ వదులుకుందట సాయి పల్లవి. అనిల్ రావిపూడి దర్వకత్వంలో మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో రష్మిక హీరోయిన్గా నటించింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. కాగా ఈ మూవీలో మొదట హీరోయిన్గా సాయి పల్లవిని అనుకున్నారట. ఈ మేరకు ఆమెను సంప్రదించినట్లు కూడా సమాచారం. అయితే కారణాలు తెలీవు గానీ ఇందులో తాను నటించలేనని చెప్పిందట. ఇక ఆ తరువాత ఆ ఆఫర్ రష్మికకు వెళ్లినట్లు సమాచారం. కాగా కెరీర్ ప్రారంభం నుంచి చాలా సెలక్టివ్గా సినిమాలు చేసుకుంటూ వస్తోంది సాయి పల్లవి. ఈ క్రమంలోనే తెలుగు, తమిళ్లో చాలా సినిమాలను ఆమె వదులుకున్నట్లు టాక్ ఉంది. ఇక సరిలేరు నీకెవ్వరులో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని భావించిన సాయి పల్లవి.. ఆ ఆఫర్ కు నో చెప్పినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం సాయి పల్లవి, రానా విరాట పర్వం.. నాగ చైతన్య సరసన లవ్ స్టోరీలో నటిస్తోంది.
పొట్టి బట్టలు వేసుకున్నందుకు ట్రోల్ చేశారు : అవికా గోర్