సినిమా ప్రపంచంలో హీరోయిన్ల నటన కంటే గ్లామర్ కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటారు. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం గ్లామర్ షోను పక్కన పెట్టి కేవలం నటనకే ప్రాధాన్యతనిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతుంటారు. అలాంటి వారిలో మనం ఇంతవరకూ నిత్యామీనన్ ను చూశాం. ఇప్పుడు సాయి పల్లవి కూడా అదే జాబితాలో చేరిపోయింది. కేరళ కుట్టీ సాయి పల్లవి “ఫిదా” చిత్రంతో తెలుగు ప్రేక్షకులని ఫిదా చేసేసింది. ప్రస్తుతం పలు తమిళ, తెలుగు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సాయి పల్లవికి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. “డియర్ కామ్రేడ్” చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించే ఛాన్స్ ముందుగా సాయి పల్లవికే వచ్చిందట. చిత్ర బృందం ముందుగా సాయి పల్లవిని సంప్రదించి స్టోరీ కూడా వినిపించారట. కథ, కథనం అంతా నచ్చాయట సాయి పల్లవికి. కానీ లిప్ లాక్ సీన్స్ గురించి చెప్పేసరికి ఈ ప్రాజెక్ట్ నిరాకరించిందట. దీంతో మేకర్స్ రష్మిక మందన్నను ఎంపిక చేశారు. ఇప్పటికే “డియర్ కామ్రేడ్” చిత్ర ట్రైలర్ విడుదల కాగా ఇందులో విజయ్, రష్మికల మధ్య లిప్ లాక్ సీన్స్ ఓ రేంజ్ లో కన్పించాయి. అయితే కోపం, బాధ, తరహాలోనే ముద్దు కూడా ఓ ఎమోషనే అని రష్మిక పేర్కొంది. నటిగా దాన్ని కూడా పండించాలి. ముద్దు సన్నివేశాలని నటన నుండి వేరుగా చూడలేమంటూ వెల్లడించింది రష్మిక. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 26న విడుదల కానుంది. ఇక సాయి పల్లవి రానా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న “విరాట పర్వం”లో నటిస్తుంది.
next post