శ్రీరాఘవ దర్శకత్వంలో సూర్య, సాయిపల్లవి, రకుల్ తదితరులు నటించిన “ఎన్.జి.కె” చిత్రం ఈనెల 31వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు చిత్రబృందం. ఈ నేపథ్యంలో చిత్ర షూటింగ్ సమయంలో ఇద్దరు హీరోయిన్ల మధ్య ఇగో కారణంగా చిన్నచిన్న గొడవలు జరిగాయని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై సాయిపల్లవి స్పందించలేదు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. సాయిపల్లవితో తనకు ఎలాంటి గొడవలు జరగలేదని, వచ్చిన వార్తలన్నీ వట్టి పుకార్లేనని తెలిపింది. ఈ చిత్రంలో సాయిపల్లవి క్యారెక్టర్కు ఎక్కువ ప్రాధాన్యత వుందని, అందుకే రకుల్ కోప్పడిందని సమాచారం. అయితే చిత్రంలో వారిద్దరికీ ప్రాధాన్యత వున్న పాత్రలేనని, వారివారి పాత్రల్లో వారు బాగా నటించారని, ప్రస్తుతం వస్తున్నవన్నీ వట్టి రూమర్స్ అని చిత్ర యూనిట్ కొట్టి పారేసింది.
previous post
next post
వైరముత్తును పెళ్ళి చేసుకో… చిన్మయికి నెటిజన్ సలహా