telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సాయిపల్లవి సవాల్… సై అంటున్న రానా

Sai-Pallavi

ఇప్పటికే భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ “స్వచ్ఛ భారత్” పేరుతో పర్యావరణాన్ని పరిరక్షించే పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో సినీ, రాజకీయ, క్రీడారంగ ప్రముఖులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వేరొకరు ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటుతున్నారు. అక్కినేని అఖిల్, ఎంపీ సంతోష్ కుమార్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటాడు. అనంతరం ఈ ఛాలెంజ్‌కు సాయిపల్లవిని, తమన్నాను నామినేట్ చేశాడు. వరుణ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సాయిపల్లవి తాజాగా ఒక మొక్క నాటింది. తను మొక్క నాటుతున్న ఫోటోను సాయిపల్లవి ట్విటర్‌లో పోస్ట్ చేసింది. అనంతరం నటుడు రానా దగ్గుబాటి, సమంతను ఈ ఛాలెంజ్‌కు సాయిపల్లవి నామినేట్ చేసింది. సాయి పల్లవి ఛాలెంజ్‌కు స్పందించిన రానా.. `సరే బాస్` అని రిప్లై ఇచ్చాడు. వీరిద్దరూ ప్రస్తుతం వేణు ఉడుగుల రూపొందిస్తున్న `విరాటపర్వం` సినిమాలో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.

Related posts