telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

అపజయాలతో … చిత్ర బడ్జెట్ తగ్గించిన .. మెగా హీరో..

sai dharmatej movie budget decreased

సాయి ధరమ్ తేజ్ – మారుతి సినిమా “ప్రతి రోజు పండగే” ఫై కూడా ప్లాప్ ల ప్రభావం పడింది. ముందుగా ఈ చిత్రానికి 20కోట్ల బడ్జెట్ అనుకున్నారు. ఆ తరువాత తేజు మార్కెట్ చూసి 12 కోట్ల వరకే కేటాయించారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరువుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుండి చిత్రబృందం ప్రీ లుక్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. చేతిలో చేయి వేసి ఉన్న ఈ ప్రీ లుక్ లో ఓ పల్లెటూరి నేపథ్యాన్ని కూడా బాగా ఎలివేట్ చేసారు. ఇక క్రిష్టమస్ సందర్భంగా డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

ఈ చిత్రంలో ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ “సుప్రీం” సినిమాలో కలిసి నటించడం జరిగింది. ఇక మిగిలిన కీలక పాత్రల్లో సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి తదితరులు నటిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఏమైనా ఈ సినిమా ఫలితం బట్టే బాక్సాఫీస్ వద్ద ‘సాయి ధరమ్ తేజ్’ రేంజ్ కూడా ఆధారపడి ఉంటుంది.

Related posts