మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చాలా కాలం తరువాత “చిత్రలహరి”తో మంచి హిట్ ను అందుకున్నాడు. ఆ తరువాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని తన కొత్త సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో చేయబోతున్నాడు. గీతా ఆర్ట్స్2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ” ఈ చిత్రానికి “ప్రతీరోజూ పండగే” అనే టైటిల్ను ఖరారు చేశారు. “సుప్రీమ్” తర్వాత రాశీఖన్నా, సాయిధరమ్ మరోసారి కలిసి నటిస్తున్నారు. “సుప్రీమ్” సినిమా వీరిద్దరికీ మంచి విజయాన్ని అందించింది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టారు. అల్లు అరవింద్ కెమేరా స్విచ్ఛాన్ చేశారు. మరి ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ మంచి విజయాన్ని అందించాలని కోరుకుందాం.
previous post