మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన “చిత్రలహరి” ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రం ఇచ్చిన బూస్ట్ తో సాయిధరమ్ తేజ్ చేస్తున్న తాజా చిత్రం “ప్రతిరోజు పండగే”. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. “ప్రతిరోజు పండగే” అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా కథానాయికగా నటిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో సరికొత్త లుక్లో తేజూ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలై టీజర్, ట్రైలర్, సాంగ్ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కుటుంబ కథా నేపథ్య చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకి ఇప్పటికే కావాల్సినంత హైప్ వచ్చింది. ఈ సినిమా విడుదల నేపథ్యంలో ఇంటర్వ్యూ ఇచ్చిన సాయితేజ్ మల్టీస్టారర్ చిత్రాల గురించి మాట్లాడాడు. “మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి నేను సిద్ధమే. నేను, వరుణ్ తరచుగా మల్టీస్టారర్ చిత్రాల గురించి మాట్లాడుకుంటాం. అనువైన కథ దొరికితే కలిసి నటించేందుకు మేమిద్దరం రెడీ. హీరో రవితేజ కూడా కలిసి నటిద్దామని అడుగుతుంటారు. `అబ్బాయ్.. మనం కలిసి సినిమా చేద్దాం అంటుంటారు. కథ దొరికితే నేను రెడీ సర్ అని చెబుతుంటాను” అని సాయితేజ్ చెప్పాడు.
previous post
next post