telugu navyamedia
సినిమా వార్తలు

100 మంది పిల్లలకు సాయి ధరమ్ తేజ్ సహాయం… స్కూల్ ను దత్తత తీసుకున్న మెగాహీరో

Sai-Dharam-Tej

మెగా మేనల్లుడు సాయితేజ్ వరుస పరాజయాల తరువాత ఇటీవలే “చిత్రలహరి”తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత ఈ మెగా హీరో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే సాయి తేజ్ సినిమాలు మాత్రమే కాదు సామాజిక సేవ‌లోనూ ముందున్నాడు. త‌నవంతుగా సహాయాన్ని అందిస్తూ సామాజిక పాత్రను స‌మ‌ర్ధ‌వంతంగా పోషిస్తున్నారు. మున్నిగూడ‌లోని అక్ష‌రాల‌యం స్కూల్‌ను రెండేళ్ల క్రితం సాయితేజ్ ద‌త్త‌త తీసుకున్నారు. రెండేళ్లుగా ఆ స్కూల్‌లో చ‌దువుతున్న 100 పిల్ల‌ల‌కు తిండి, చ‌దువును అందిస్తున్నారు సాయితేజ్‌. ఈ ప‌నుల‌ను సాయితేజ్ `థింక్ పీస్‌` అనే స్వ‌చ్ఛంద సంస్థ ద్వారా ప‌ర్య‌వేక్షిస్తున్నారు సాయితేజ్‌. రెండేళ్లుగా పిల్ల‌ల బాగోగుల‌ను చూస్తున్న సాయితేజ్‌కు థింక్ పీస్ సంస్థ కృత‌జ్ఞ‌త‌లను తెలియ‌జేసింది. రెండేళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి నిర్వ‌హించిన “మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు” షోలో పాల్గొన్న సాయితేజ అందులో వ‌చ్చిన ప్రైజ్ మ‌నీని కూడా స్కూల్ చిన్నారుల కోసమే వినియోగించారు.

Related posts