సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చిత్రలహరి’. నివేదా పేతురాజ్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. తొలిరోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు ఈ సినిమా రూ.3.08 కోట్ల షేర్ ని రాబట్టింది.
ఈ 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. బయ్యర్ల పెట్టుబడిలో 80 శాతం వెనక్కి వచ్చేసింది. త్వరలోనే ఈ సినిమా లాభాల బాట పడుతుందని అంటున్నారు. కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతోన్న సాయిధరమ్ తేజ్ కి ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ ఎంతో ఊరట కలిగిస్తోందని అంటున్నారు. అయితే ఈ సినిమా అయినా సాయి తేజ్ కు హిట్ ఇస్తుందేమో చూడాలి.
‘సీటీమార్’ విజయంపై ప్రభాస్ కామెంట్స్