విశాఖ జిల్లా అనకాపల్లిలో డిగ్రీ విద్యార్ధినిపై సాయి అనే ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. విద్యార్ధిని యశోద భార్గవిపై నడిరోడ్డుపై సాయి అనే యువకుడు గొంతులో స్కూడ్రైవర్ తో దాడికి దిగాడు. దీంతో భార్గవి ముఖం,భుజం, పక్కటెముకల్లో తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్ధిని పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
అనకాపల్లిలో డీవీఎన్ కాలేజీలో యశోద భార్గవి డిగ్రీ ఫస్టియర్ చదువుతుంది. కొంతకాలంగా సాయి అనే యువకుడు భార్గవిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. బుధవారం నాడు కాలేజీ నుండి ఇంటికివెళ్లున్న భార్గవి పై స్కూడ్రైవర్ తో దాడి చేశాడు. ఈ ఘటన రామచంద్ర థఇయేటర్ వద్ద చోటు చేసుకొంది. వెంటనే స్థానికులు నిందితుడిని పట్టుకొని చితకబాదారు. ప్రేమ తిరస్కరించడంతో సాయి ఈ దారుణానికి పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.