telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

మహారాష్ట్రలో ఇద్దరు సాధువుల హత్య.. తెలంగాణలో నిందితుడి అరెస్ట్

New couples attack SR Nagar

మహారాష్ట్రంలోని నాందేడ్ పట్టణంలో శనివారం రాత్రి ఇద్దరు సాధువులు హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. లాక్ డౌన్ అమల్లో ఉన్న సమయంలో సాధువుల మృతదేహాలు కనిపించడం దిగ్భ్రాంతి కలిగించింది. ఈ కేసులో పోలీసులు స్వల్ప వ్యవధిలోనే నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న నిందితుడు తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో పట్టుబడ్టాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా, కేవలం డబ్బు కోసమే సాధువులను హత్య చేసినట్టు అంగీకరించాడు. అతడి నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేసిన పోలీసులు ఆపై రిమాండ్ కు తరలించారు.

Related posts