టీడీపీకి మహిళా విభాగం నేత సాధినేని యామిని గుడ్బై తెలిపారు. టీడీపీ వాట్సప్ గ్రూప్లో తన రాజీనామా లేఖను ఆమె పోస్టు చేశారు. పార్టీలో అంతర్గత విభేదాలు, ఇబ్బందులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. దేశం, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, బలమైన కారణాల వల్లే టీడీపీకి రాజీనామా చేశానని యామిని ప్రకటించారు.
పార్టీ తరుపున అనేక పర్యాయాలు ప్రతిపక్షాలను ధీటుగా సమాధానమిచ్చిన డైనమిక్ మహిళా నేతగా ఆమె నిలిచిన విషయం తెలిసిందే. అయితే 2019 ఎన్నికలలో ఓటమితో పలు నేతలు టీడీపీకి వీడ్కోలు పలుకుతున్న నేపథ్యంలో ఆమెకూడా నేడు పార్టీకి రాజీనామా చేశారు. తదనంతర రాజకీయ భవితవ్యం గురించి ఆమె మరో రెండు రోజులలో స్పందించవచ్చని తెలుస్తుంది.