telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పేపర్ లీక్ పై ప్రభుత్వ శాఖలే వివరణ ఇవ్వాలి: ఏపీపీఎస్సీ

AP-Grama-Sachivalayam

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగాల నియామకాల పేపర్ లీక్ పై ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ స్పందించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకాల బాధ్యతను ప్రభుత్వం తమకు అప్పగించలేదని స్పష్టం చేశారు. పరీక్షా పేపర్ లీకైనట్లు వస్తున్న ఆరోపణలకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

ఆరోపణలపై సంబంధిత ప్రభుత్వ శాఖలే వివరణ ఇవ్వాలని సూచించారు. పరీక్షలు నిర్వహించిన పంచాయితీరాజ్ శాఖే వివరణ ఇవ్వాలని సూచించారు. ప్రశ్నాపత్రం లీకైనట్లు వస్తున్న వార్తలకు తాము వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తప్పు జరిగిందా లేదా అనేది తమకు సంభందం లేదని స్పష్టం చేశారు. పరీక్షలకు సంభందించిన కాన్ఫిడెన్షియల్ పక్రియను తాము నిర్వహించలేదన్నారు.

Related posts