telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సచిన్ జోషి అరెస్ట్…

సినీ నటుడు సచిన్ జోషి హీరోగానే కాదు.. నిర్మాత, వ్యాపారవేత్తగా పేరొందిన సచిన్‌ జోషి మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు నిన్న రాత్రి సచిన్‌ జోషిని అరెస్ట్‌ చేశారు. గతంలో ప్రముఖ బిజినెస్‌ మ్యాన్‌ విజయ్‌ మాల్యాకు సంబంధించిన బంగ్లాను సచిన్‌ జోషి కొనుగోలు చేశాడు. అయితే.. ఈ వ్యవహరంలో రియల్ ఎస్టేట్ సంస్థ ఓంకార్ గ్రూప్, సచిన్‌ జోషి మధ్య ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈ వ్యవహరంలో ఏకంగా 100 కోట్ల మేరకు మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు సచిన్‌ జోషి ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో గతంలోనే విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది ఈడీ. అయితే.. విచారణకు సచిన్ జోషి హాజరు కాకపోవడంతో తాజాగా అరెస్ట్‌ చేసారు అధికారులు. అయితే సచిన్ సినిమాల గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఒరేయ్‌పండు, జాక్‌పాట్‌, మౌనమేలనోయి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు సచిన్ జోషి. చూడాలి మరి ఈ కేసులో ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts