ఎంసెట్తో పాటు అన్ని రకాల సెట్లపై శనివారం నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి పరీక్షా కేంద్రంలో శానిటైజేషన్, భౌతిక దూరం తప్పకుండా పాటించాలన్నారు.ఫీజులు పెంచొద్దని ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు.ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.