ఈ ఏడాది శబరిమల యాత్రకు కేరళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నవంబర్ 16న యాత్ర ప్రారంభమవుతుందని కేరళ దేవాదాయశాఖ మంత్రి సురేంద్రన్ తెలిపారు. కరోనా నిబంధనలకు లోబడి యాత్ర కొనసాగుతుందని అన్నారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు తమకు కరోనా లేదని నిరూపించే కొవిడ్-19 సర్టిఫికెట్ను తప్పనిసరిగా సమర్పించాల్సి వుంటుందని ఆయన స్పష్టంచేశారు.
ఐసీఎమ్మార్ గుర్తింపు పొందిన ల్యాబ్లలో మాత్రమే భక్తులు పరీక్షలు చేయించుకోవాల్సి వుంటుందని చెప్పారు. దర్శనానికి వచ్చే భక్తులందరినీ స్క్రీనింగ్ చేస్తామని తెలిపారు. సన్నిధానం, నీలక్కల్, పంబ ప్రాంతాల్లోని హాస్పిటళ్లలో మరిన్ని సౌకర్యాలను సిద్ధం చేస్తామని తెలిపారు. పంబ, నీలక్కల్ మధ్య తిరిగే బస్సుల్లోనూ భౌతికదూరాన్ని తప్పనిసరి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
కాంగ్రెస్ బాగుపడాలంటే ఉత్తమ్ తప్పుకోవాలి: రాజగోపాల్రెడ్డి