యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సాహో”. ఇప్పటికే విడుదలైన టీజర్లో ప్రభాస్ చేసిన స్టంట్స్, యాక్షన్ సీన్స్ సామాన్య జనాలనే కాక సెలబ్రిటీలని కూడా ఆకట్టుకుంటున్నాయి. 150 కోట్ల బడ్జెట్తో సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తుంది. నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర చివరి షెడ్యూల్ జరుగుతుండగా, ఆగస్ట్ 15న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు ప్రకటించారు. కానీ ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కావడం లేదట. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని ఆగస్ట్ 30న విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం. దీంతో ఇప్పటి వరకు ‘సాహో’ విడుదలను దృష్టిలో పెట్టుకుని వాయిదా పడిన చిత్రాలన్నీ ఈ ఆగస్ట్ 15కు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే శర్వానంద్ ‘రణరంగం’, అడవి శేష్ ‘ఎవరు’ చిత్రాలు ఆగస్ట్ 15న విడుదల అవుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.