రేపు విడుదల కానున్న సాహో చిత్రం హంగామా స్టార్ట్ అయింది. ఈ చిత్రం కోసం జనాలు థియేటర్స్ దగ్గర బారులు తీరుతున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని పూర్తి అయ్యాయి. సాహో సినిమా ఎప్పుడెప్పుడా చూస్తామా అని అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. నాలుగు రోజుల ముందు నుండే థియేటర్స్ దగ్గర హంగామా మొదలైంది. అభిమానులు ప్రభాస్కి సంబంధించి భారీ కటౌట్స్ ఏర్పాటు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
భీమవరంలో ప్రభాస్ ఫ్యాన్స్ భారీ కటౌట్ ఏర్పాటు చేయగా, ఇది ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది. కటౌట్స్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అని చెబుతున్నారు. సాహో చిత్రం దాదాపు 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కగా, ఈ చిత్రం తొలి రోజే పూర్తి వసూళ్ళని రాబడుతుందని విశ్లేషకులు అంటున్నారు. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ముఖ్య పాత్రలు పోషించారు