telugu navyamedia
సినిమా వార్తలు

ఆసుపత్రి పాలైన “సాహో” దర్శకుడు

saaho movie team surprice on sradda birthday

ప్రభాస్ ప్రధాన పాత్రలో సుజీత్‌ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్‌ సంస్థ దాదాపు 300 కొట్లతో నిర్మించిన చిత్రం “సాహో”. ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యూవీ క్రియేషన్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, మందిరా బేడీ కీలక పాత్రల్లో నటించారు. శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇప్పటి వరకు 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని నిర్మాతలే అనౌన్స్ చేసారు. ఇక షేర్ కూడా 200 కోట్ల వరకు ఉంది. ఇంకా 100 కోట్లు తీసుకొస్తే కానీ సినిమా హిట్ అనిపించుకోదు. అవి ఎలాగూ వచ్చేలా కనిపించడం లేదు. దాంతో సాహో హిందీలో హిట్ అనిపించినా కూడా మిగిలిన చోట్ల మాత్రం భారీ ఫ్లాప్ అయ్యేలా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సుజీత్ హాస్పిటల్ పాలు కావడం సంచలనంగా మారుతుంది. కొన్నిరోజులుగా ఈ కుర్రాడు డెంగీతో బాధపడుతున్నాడు. అయితే ఆయన సాహో పనులతో బిజీగా ఉండి అసలు తన ఆరోగ్యాన్ని కూడా ఈయన పట్టించుకోలేదని తెలుస్తుంది. సాధారణ జ్వరం అనుకుని వదిలేసిన ఈ కుర్ర దర్శకుడికి ఇప్పుడు అనారోగ్యం మళ్లీ తిరగబెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రెండు రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్నాడు సుజీత్. ఈయనకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారని.. పూర్తిస్థాయిలో కోలుకోడానికి మాత్రం కొన్ని రోజులు సమయం పడుతుందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తుంది. సాహో విడుదలకు ముందు కొన్ని రోజులు ఆయన కనీసం నిద్ర కూడా పోలేదని చెప్పారు సన్నిహితులు. దానికితోడు విడుదలైన తర్వాత విమర్శలతో మరింత డిస్టర్బ్ అయ్యాడు సుజీత్. మానసిక వేదన ఎక్కువ కావడంతోనే సుజీత్ మరింత అనారోగ్యం పాలయ్యాడని చెబుతున్నారు సన్నిహితులు. కానీ హీరో ప్రభాస్, యూవీ క్రియేషన్స్ మాత్రం తమ దర్శకున్ని వెనకేసుకొస్తున్నాయి.

Related posts