కర్ణాటకలో తాను సాగు చేసిన అరటిపండ్లు అమ్ముడుపోలేదని చెత్తకుప్పలో పారేయకుండా.. వాటిని శ్రద్ధగా ఎండబెట్టాడు. అరటి పండ్లను పోషకాలు నిండిన డ్రైఫ్రూట్గా మార్చేసి లాభాలు ఆర్జిస్తున్నాడు.
డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో వైద్యులు చెబుతూనే ఉంటారు. అయితే ఇన్నాళ్లు… ఎండు ద్రాక్షా.. ఎండిన అప్రికాట్.. ఎండబెట్టిన అంజీరా.. కాజూ,బాదం.. ఇలా డ్రైఫ్రూట్స్లో చాలా రకాలే తిని ఉంటాం. కానీ, ఇప్పుడు మన దేశంలో ఉత్పత్తవుతున్న ఎండు అరటిపండును ఈ జాబితాలోకి చేర్చేశాడు కర్ణాటకకు చెందిన ఓ రైతు.
కష్టం నుంచి ఆలోచన!
బళ్లారి, కంపిలి తాలూకా, రామసాగర గ్రామానికి చెందిన కె.గంగాధర్ ఓసాధారణరైతు. లాక్డౌన్ వేళ సుగంధి రకం అరటిని సాగు చేశాడు గంగాధర్. కానీ, కరోనా కారణంగా మార్కెట్ పడిపోయి గిట్టుబాటు ధర రాలేదు. దీంతో పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరైందని బాధపడ్డాడు.
కానీ,మనిషి_తలచుకుంటేఎంతటి విపత్తులోనైనా ఓ మార్గాన్ని వెతకొచ్చని గుర్తించాడు. వెంటనే, అరటిపళ్లు పాడవ్వకుండా వాటిని ఏం చేయొచ్చని ఆలోచించాడు.
విదేశాల్లో ఎండు అరటిపండ్లకున్న డిమాండ్ గురించి తెలుసుకున్నాడు గంగాధర్.
భారత్లో తనలాంటి రైతులను సంప్రదించాడు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో.. నెల రోజులకు పైగా అరటి పండ్లను ఎండబెట్టి ఓ డబ్బాలో ప్యాక్ చేసి జిల్లాలోని హోల్సేస్, రిటైల్ దుకాణాలకు విక్రయించి లాభాలు పొందుతున్నాడు.
ఎండబెట్టిన అరటిపండ్లలో పోషకాలు_పుష్కలంగా ఉంటాయని.. ఈ డ్రైఫ్రూట్ను తింటే ఆరోగ్యానికెన్నో లాభాలున్నాయని రాయ్చూర్ వ్యవసాయ వర్సిటీ ధ్రువీకరించింది. దీంతో ప్రభుత్వం సహకరిస్తే… ఈ డ్రై_బనానా ఉత్పత్తిని మరింత వృద్ధి చేస్తానంటున్నాడు గంగాధర్
ఇంత మంచి ఐడియా షేర్ చేయడం వలన మన రైతుకి ఉపయోగం ఉండొచ్చు…