వర్షాలు కురవకపోయినా
పంటలు పండక పోయినా
ఎరువులు దొరకకపోయినా
గిట్టుబాటు పలకకపోయినా
విద్యుత్తు అందకపోయినా
సబ్సిడీలు ఇవ్వకపోయినా
పురుగులమందు కల్తీఅయినా
ఋణాలు తీరకపోయినా
రైతే రాజు…ఎందుకంటే
ప్లాటు అమ్ముకుని
కోట్లుదోచుకునే
నాయకులు సేవకులైనప్పుడు
పొలం నమ్ముకుని
అందరికి అన్నంపెట్టే
రైతేగా రాజు…!
—–కయ్యూరు బాలసుబ్రమణ్యం
శ్రీకాళహస్తి…✍